- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
దివ్యాంగులకు అండగా ప్రభుత్వం

దిశ, కామారెడ్డి : దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో బుధవారం జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు పెంచిన పింఛన్ ఉత్తర్వులను కలెక్టర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. దివ్యాంగులకు ప్రభుత్వం చేయూతనిస్తోందని తెలిపారు.
గతంలో రూ. 3016 ఉన్న ఆసరా పింఛన్ ను రూ.4016 లకు ప్రభుత్వం పెంచిందని చెప్పారు. గతంలో కంటే వెయ్యి రూపాయలు పెంచిందని పేర్కొన్నారు. బీడీ టేకేదారులు, ప్యాకర్లకు కొత్తగా ఆసరా పింఛన్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీఆర్డీ ఓ సాయన్న, అడిషనల్ డీఆర్డిఓ మురళీకృష్ణ, డీపీఎంలు, దివ్యాంగులు, టేకేదారులు పాల్గొన్నారు.
మహిళలు చేపల పెంపకం చేపట్టి ఆర్థికంగా ఎదగాలి
చేపల పెంపకం చేపట్టి మహిళలు ఆర్థికంగా ఎదగాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో బుధవారం స్వయం సహాయక సంఘాల మహిళలకు జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చేపల పెంపకం, మార్కెటింగ్, సాంకేతిక అంశాలపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.
వ్యవసాయంతో పాటు అనుబంధంగా చేపల పెంపకం చేపట్టి మహిళలు లక్షాధికారులు కావాలని తెలిపారు. ఇతర మహిళలకు ఆదర్శంగా ఉండాలని కోరారు. సాంకేతిక అంశాలు, మార్కెటింగ్ మెలకువలు నేర్చుకొని ఆర్థికంగా పటిష్టం కావాలని సూచించారు. మహిళల సందేహాలకు అధికారులు సమాధానాలు తెలిపారు. సమావేశంలో డీ ఆర్డీఓ సాయన్న, అడిషనల్ డీఆర్డీ ఓ మురళీకృష్ణ, డీపీఎంలు, స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు.