- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ముంపు ప్రాంతాలను విస్మరించిన ప్రభుత్వం

దిశ ప్రతినిధి,కొత్తగూడెం : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముంపునకు గురైన ప్రాంతాలను విస్మరించిందని మాజీ పార్లమెంటు సభ్యుడు, కాంగ్రెస్ నాయకులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం కొత్తగూడెంలో కాంగ్రెస్ శ్రేణులతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీలో వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు పొంగులేటి అభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం కొత్తగూడెం క్లబ్లో ఏర్పాటుచేసిన వేదికను చేరుకొని సుమారు 100కు పైగా కుటుంబాలను కాంగ్రెస్ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం చుంచుపల్లి మండలం విద్యానగర్లో తమ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత కొంతకాలంగా కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలో అనేక ప్రాంతాలు ముంపు కి గురై వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయని,
రాష్ట్ర ప్రభుత్వం వారి పట్ల నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని విమర్శించారు. గోదావరి, కృష్ణా పరీవాహక ప్రాంతాలలో వరద ఉధృతికి అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని, తెలంగాణ ఏర్పడితే ముంపునకు గురయ్యే ప్రాంతాలన్నిటికీ శాశ్వత పరిష్కారం దొరుకుతుందని ఎదురు చూసిన ప్రజలకు నిరాశ ఎదురైందని అన్నారు. గత సంవత్సరం గోదావరి వరదల నేపథ్యంలో భద్రాచలంలో పర్యటించిన ముఖ్యమంత్రి గోదావరికి రెండు పక్కల ఉన్న కరకట్టల ఎత్తును పెంచి వచ్చే ఏడాది కల్లా శాశ్వత పరిష్కారం చేపడతామని 1000 కోట్లు ప్రకటించి సంవత్సరం దాటినప్పటికీ ఆర్థికపరమైన జీవోలు కానీ ఎస్టిమేషన్లు కానీ,టెండర్ల పిలవ లేదన్నారు. నివాసయోగ్యమైన
ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను ఖాళీ చేపించి పక్కా ఇల్లు ఇస్తామని మాట ఇచ్చి ఇంతవరకు అమలు చేయలేదనర్నారు. తప్పుడు హామీలతో జనాన్ని మెప్పించడం తప్ప ఏ పని కార్యాచరణ దాల్చలేదని అన్నారు. భద్రాచల రామాలయం అభివృద్ధికి 100 కోట్లు, గోదావరి పరీవాహక ప్రాంతాలు ముంపుకు గురవకుండా వెయ్యి కోట్లు, ఖమ్మంలో తీగల వంతెన కడతామని 220 కోట్లు ప్రకటించి ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఖమ్మం పాలేరు మధ్యలో ఉన్న మున్నేరు మీద రిటర్నింగ్ వాల్స్ 150 కోట్లుతో నిర్మిస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. మాట ఇచ్చి మర్చిపోవడం కల్వకుంట్ల వారికే సాధ్యమవుతుందని అన్నారు. సొంత రాష్ట్రం లో ఉన్న
సమస్యలు తీర్చకుండా పక్క రాష్ట్రాలపై దృష్టి పెట్టడం ఏంటని ప్రశ్నించారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈ సమస్యలన్నిటికీ శాశ్వత పరిష్కారం కచ్చితంగా చూపెడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎడవల్లి కృష్ణ,నాగ సీతారాములు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పోదాం వీరయ్య, ఆళ్ల మురళి, ఊకంటి గోపాలరావు, తూము చౌదరి, నాగేంద్ర త్రివేది, కాంగ్రెస్ కార్యకర్తలు, పొంగులేటి అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.