ఇంటింటికీ మంచినీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం : కందాల

by Sridhar Babu |
ఇంటింటికీ మంచినీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం : కందాల
X

దిశ, కూసుమంచి : ఇంటింటికీ మంచినీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి అన్నారు. కూసుమంచి మండలం జీళ్ళచెర్వు గ్రామంలోని పాలేరు సెగ్మెంట్ మిషన్ భగీరథ నీటి శుద్ధి కేంద్రంలో నిర్వహించిన తాగునీటి దినోత్సవానికి ఆయన ముఖ్య ఆతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణలోని ప్రతి గల్లీ నుంచి మొదలుకొని పట్టణం వరకు ఇంటింటికీ భగీరద నీటిని అందించడమే తమ కర్తవ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాత మధుసూదన్ , జిల్లా కలెక్టర్ విపి.గౌతమ్, కూసుమంచి ఎంపీపీ శ్రీనివాస్, జెడ్పీటీసీ బేబీ, డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్, జీళ్లచెర్వు సర్పంచ్ కొండ సత్యం, ఎంపీటీసీ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed