రాజ్యాంగ నిర్మాతకు ప్రభుత్వ విప్ నివాళి

by Disha Web Desk 15 |
రాజ్యాంగ నిర్మాతకు ప్రభుత్వ విప్ నివాళి
X

దిశ, మణుగూరు : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వ విప్ , పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఎనిమిదిన్నర సంవత్సరాలలో బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా దళిత బంధు అమలు అవుతుందన్నారు. తెలంగాణ కొత్త సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టుకున్నామని గుర్తు చేశారు. కార్యక్రమంలో మణుగూరు మండలం, BRS పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.


Next Story