- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
''మీరు కూల్చుతారా.. మమ్మల్ని కూల్చామంటారా''

దిశ, మణుగూరు: మండలంలోని ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్ట్ ప్రక్కన ఉన్న ప్రభుత్వ భూమిని కబ్జా చేసి అక్రమ కట్టడాలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గురిజాల గోపి అన్నారు. మంగళవారం మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కొందరు ప్రభుత్వ భూమిని కబ్జా చేసి, అక్రమ కట్టడాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడాలు నిర్మిస్తుంటే అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించారు. అక్రమ కట్టడాన్ని అధికారులు కూల్చుతారా.. లేదా మమ్మల్ని కూల్చామంటారా.. అని అధికారులను ప్రశ్నించారు.
ప్రభుత్వ భూమిపై దొంగ పట్టా సృష్టించి లక్షల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని తెలిపారు. కబ్జాకు గురైంది ప్రభుత్వ భూమి అని మణుగూరు ప్రజానీకానికి తెలుసని.. అవసరమైతే 10వేల మందితో సంతక సేకరణ కూడా చేపడుతామన్నారు. అవినీతిని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. 24గంటల్లో ప్రభుత్వ స్థలంలో నిర్మించిన అక్రమ కట్టడాన్ని కూల్చకపోతే.. కాంగ్రెస్ పార్టీ, అఖిలపక్ష పార్టీలన్నీ కలుపుకొని కూల్చివేడానికి సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు బుర్గుల నరసయ్య, మహిళ నాయకురాల్లు భోగినేని వరలక్ష్మి, శబన, సౌజన్య తదితరులు పాల్గొన్నారు.