గొల్ల కురుమలు ఆర్థికంగా ఎదగాలి

by Sridhar Babu |
గొల్ల కురుమలు ఆర్థికంగా ఎదగాలి
X

దిశ, టేకులపల్లి : టేకులపల్లి మండలం పెగళ్లపాడు గ్రామపంచాయతీలో రెండో విడత గొర్రెల పంపిణీని ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ ప్రారంభించారు. ఆమె చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యాదవుల సంక్షేమం అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని , వారి కోసం మేకలు, గొర్లు సబ్సిడీ పథకాన్ని అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. యాదవుల సంక్షేమం కోసం ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం గొర్రెలను పంపిణీ చేసి

వారి అభివృద్ధికి బాటలు వేస్తాం అన్నారు. రాష్ట్రంలో ఉన్న యాదవ సోదరులందరూ ఆర్థికంగా బోలోపేతం కావాలని, రానున్న కాలంలో బంగారు తెలంగాణ నిర్మాణంలో తమ వంతు పాత్ర వారే పోషించే విధంగా తీర్చిదిద్దాలనేదే లక్ష్యంతోనే సీఎం కేసీఆర్ పథకాన్ని తీసుకువచ్చారు అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బొమ్మెర్ల వరప్రసాద్, జిల్లా నాయకులు బానోత్ రామా నాయక్, ఉపాధ్యక్షులు చీమల సత్యనారాయణ, మండల అధికార ప్రతినిధి బానోత్ కిషన్ నాయక్, బర్మావత్ శివకృష్ణ, భూక్య పాపా నాయక్, బానోత్ రవీందర్, మంద రాజు, కొండ బత్తుల శ్యామ్, చిట్టి రాజు, ఉప సర్పంచ్ ముచ్చ జయరాజు, నర్సింగ్ సుదీప్, కుమ్మరి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed