ఓవర్​టేక్​ చేయబోయి...బస్సును ఢీకొని....

by Sridhar Babu |   ( Updated:2022-12-16 11:49:47.0  )
ఓవర్​టేక్​ చేయబోయి...బస్సును ఢీకొని....
X

దిశ,బూర్గంపాడు : బూర్గంపాడు మండల పరిధిలోని మోరంపల్లిబంజర గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. మణుగూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఖమ్మం నుండి మణుగూరుకు వెళ్తుండగా మోరంపల్లి బంజర ప్రాథమిక ఆసుపత్రి వద్ద ఓ ద్విచక్ర వాహనం లారీని ఓవర్ టేక్ చేస్తున్న క్రమంలో ఎదురుగా వచ్చి ఈ బస్సును ఢీకొట్టాడు. దీంతో ద్విచక్ర వాహనం నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు బూర్గంపాడు మండలం పినపాక పట్టినగర్ గ్రామానికి చెందిన క్యాటరింగ్ ప్రసాద్ గా గుర్తించారు. మృతుడికి భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. ఈ ఘటనపై స్థానికులు బూర్గంపాడు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి బూర్గంపాడు ఎస్సై పి.సంతోష్ చేరుకొని వివరాలు సేకరించారు. సంఘటన స్థలానికి కొత్తగూడెం డిపో మేనేజర్ వెంకటేశ్వరరావు, ఎస్టీఐ గీతాకృష్ణ, భద్రాచలం ఆర్టీసీ సీఐ గౌతమి, మణుగూరు ఆర్టీసీ సీఐ కనకదుర్గ చేరుకొని ప్రమాదం జరిగిన ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బూర్గంపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సంతోష్ తెలిపారు.



Next Story

Most Viewed