- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
బాతు కోసం చెరువులోకి వెళ్లి మృత్యువాత

దిశ, అశ్వారావుపేట : ఆదివారం కావడంతో సరదాగా చేపలవేటకు వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృత్యువాత పడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రామన్నగూడెం కు చెందిన నారం మంగరాజు (35) స్నేహితుడితో కలిసి గంగారం చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో చెరువులో బాతు కనిపించడంతో ఇద్దరు చెరువులోకి దూకి దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించారు.
ఈత కొడుతుండగా నారం మంగరాజు మునిగిపోగా.. మరో యువకుడు ఒడ్డుకు చేరాడు. స్థానికులు చెరువులో గాలించి నారం మంగరాజు మృతదేహాన్ని గుర్తించారు. ఈత కొడుతుండగా చెరువు కింద భాగంలోని నాచు కాళ్లకు చుట్టుకోవడమే మంగరాజు మృతికి గల కారణంగా తెలుస్తుంది. మృతుడికి భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అశ్వారావుపేటలోని మార్చరీకి తరలించారు.