ఒక్క అవకాశం ఇవ్వండి...అభివృద్ధిలో ముందుంచుతా

by Disha Web Desk 15 |
ఒక్క అవకాశం ఇవ్వండి...అభివృద్ధిలో ముందుంచుతా
X

దిశ, దమ్మపేట : తనకు ఒక్క అవకాశం ఇవ్వండి...అభివృద్ధిలో ముందుంచుతా అని ఖమ్మం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు కోరారు. మండలంలో మంగళవారం ఆయన రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మందలపల్లి క్రాస్ రోడ్ నుండి దమ్మపేట వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ప్రతి ఒక్కరిని కలుసుకొని బీజేపీ మేనిఫెస్టోను వివరిస్తూ ముందుకు సాగారు. అనంతరం దమ్మపేట ప్రధాన కూడలిలో ప్రచార వాహనంపై నుండి ప్రజలతో మాట్లాడారు.

ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా తనను గెలిపించి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరారు. తనను గెలిపిస్తే అశ్వారావుపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందు ఉంచుతానని అన్నారు. గత పాలకులు దమ్మపేట మండలాన్ని పట్టించుకున్న పాపాన పోలేదని, కనీసం మండలంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని పునరుద్ధరించలేదని అన్నారు. తనను గెలిపిస్తే మండల పరిధిలో ఉన్న అన్ని గ్రామాల్లో ఉన్న రోడ్ల సమస్యలను పరిష్కరిస్తానని, ప్రతి ఒక్కరికి 24 గంటలు అందుబాటులో ఉంటూ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందు ఉంచుతానని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రంగా కిరణ్, మండల నాయకులు గొట్టిపుల్ల దుర్గా శ్రీనివాస్, ఉడతనేని విశ్వేశ్వరరావు, దారా నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed