రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేసి సంబరాలు జరుపుకోండి

by Sridhar Babu |
రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేసి సంబరాలు జరుపుకోండి
X

దిశ,నేలకొండపల్లి : తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న రైతు దినోత్సవం పై కాంగ్రెస్ ఎటాక్ చేసింది. దీనిలో భాగంగా శనివారం పోస్ట్ కార్డు ఉద్యమం ప్రారంభించారు. పాలేరు నియోజకవర్గంలో టీపీసీసీ మెంబర్ రాయల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సీఎంకు పోస్టుకార్డు రాశారు. తొమ్మిదేళ్లుగా రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేసి సంబరాలు జరపాలంటూ ముఖ్యమంత్రి కి జాబు పంపారు. 2018 మ్యానిఫెస్టోలో రైతు రుణమాఫీ ఏమైందంటూ ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ జాబ్ కార్డు ఉద్యమం జిల్లాలో సంచలంగా మారింది. అటు వివిధ రైతు వేదికల్లో ఎమ్మెల్యేలకు నిరసన సెగ తగిలింది.



Next Story

Most Viewed