నాలుగో తరగతి ఉద్యోగుల ఇల్లందు డివిజన్ కమిటీ ఎన్నిక

by S Gopi |
నాలుగో తరగతి ఉద్యోగుల ఇల్లందు డివిజన్ కమిటీ ఎన్నిక
X

దిశ, ఇల్లందు టౌన్: తెలంగాణ రాష్ట్రంలోని నాలుగో తరగతి ఉద్యోగుల ఇల్లందు డివిజన్ కమిటీ సమావేశంలో జిల్లా అధ్యక్షులు ఎస్.కె సాధిక్ భాష ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో అన్ని విభాగాలకు సంబంధించిన నాలుగో తరగతి ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నాలుగో తరగతి ఉద్యోగుల భూముల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ని సైతం కలిసి తమ డిమాండ్లను తెలియజేయలన్నారు. ఇల్లందు డివిజన్ నూతన కమిటీ ఎన్నికలో న్యాయ నిర్ణీతలుగా ఎస్ కే సాదిక్ పాషా, కార్యదర్శి దినేష్, కేంద్ర కమిటీ సంఘం కార్యదర్శి కృష్ణవేణిల ఆధ్వర్యంలో నూతన అధ్యక్షుడిగా ఎండి. ముస్తఫా, కార్యదర్శిగా గౌస్ పాషా, ఉపాధ్యక్షుడిగా నయీమ్ పాషా, కోశాధికారిగా వినోద్ కుమార్, సహాయ కార్యదర్శులుగా వీరన్న, చైతన్య, శివ నారాయణ, దేశ్య, ఈసీ మెంబర్లుగా కనకదుర్గ, రాంబాయి, వాణి ఎన్నికయ్యారు. నూతనంగా ఎంపికైన ఇల్లందు డివిజన్ కమిటీ మెంబర్లకు ఉద్యోగులు శుభాకాంక్షలు తెలియజేశారు.



Next Story

Most Viewed