ధరల నియంత్రణలో మోడీ ప్రభుత్వం విఫలం..నంద్యాల నరసింహారెడ్డి

by Sumithra |
ధరల నియంత్రణలో మోడీ ప్రభుత్వం విఫలం..నంద్యాల నరసింహారెడ్డి
X

దిశ, కూసుమంచి : కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ఆర్థిక విధానాల వల్ల దేశంలో ఉన్న 90 శాతం ప్రజల కష్టాన్ని అప్పనంగా కార్పొరేట్ శక్తులకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు ప్రజల కష్టాన్ని దోచుపెడుతుందని, దేశంలో ధరల నియంత్రణలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని మాజీ శాసనసభ్యులు, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నంద్యాల నరసింహారెడ్డి ఆరోపించారు. సోమవారం మండలంలోని మల్లేపల్లి గ్రామంలో బోడెపుడి నగర్ బీకేఆర్ ఫంక్షన్ హాల్ లో జరుగుతున్న రెండు రోజుల తెలంగాణ రైతు సంఘం జిల్లా రాజకీయ శిక్షణ తరగతుల్లో (17,18 తేదీలో) మొదటి రోజు ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన తొమ్మిది సంవత్సరాల కాలంలో దేశంలో బీజేపీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదని, ఎన్నికల హమీలో భాగంగా డాక్టర్ సోమనాథ్ కమిషన్ అమలు చేసి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి 300 సభల్లో మోడీ చెప్పారని, నేటికీ ఆ కమిషన్ అమలు చేయకపోగా రైతుల ఆత్మహత్యలకు బీజేపీ ప్రభుత్వం కారణమయ్యే విధంగా వ్యవసాయ రంగంలో చట్టాలను తీసుకువచ్చారని అన్నారు.

దేశంలో మూడు నల్ల చట్టాలని తీసుకొచ్చే ప్రయత్నం చేసిందని, కానీ రైతు సంఘాలు, కమ్యూనిస్టు పార్టీలు తిప్పుకోటంతో నల్ల చట్టాలను రద్దు చేశారన్నారు. అలాగే దేశంలో ఉన్న నల్లధనం మొత్తం విదేశీ బ్యాంకుల్లో ఉన్నదని ఆ విదేశీ ధనాన్ని బీజేపీ అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లో తిరిగి తీసుకువచ్చి దేశప్రజల ఒక్కొక్కరికి ఎకౌంట్లో రూ.15 లక్షల రూపాయలు ప్రజల బ్యాంక్ అకౌంట్లో జమచేస్తానని హామీ ఇచ్చారని, అది అమలు చేయక పోగా దేశంలో కార్పొరేట్ శక్తులకు లాభం కలిగించే విధంగా, ప్రభుత్వ బ్యాంకు నుండి కార్పోరేట్ శక్తులను తీసుకున్న అప్పులను ప్రభుత్వ బ్యాంకులకు జమ చేయకపోగా, కార్పొరేట్ దోపిడీ దారుల అప్పులను ప్రభుత్వమే రద్దు చేయడంతో పాటు అప్పుల ఎగవేత దారులను స్వయంగా మోడీ ప్రభుత్వం దగ్గర వుండి, పంపిందని విమర్శించారు.

విదేశాలకు మోడీ ప్రభుత్వం కార్పొరేట్ మోసగాళ్ల పక్కన చేరి ప్రజలకష్టాన్ని జనగల పీలుస్తుందని ప్రజల సొమ్ముతో కార్పోరేట్ శక్తులు లాభాలు పొంది విదేశాలకు పయనమయితున్నాయని ఆయన ఆరోపించారు. మోడీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ తొమ్మిది సంవత్సరాల్లో సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇంతవరకు అమలు చేయలేదని, దేశంలో రోజురోజుకు నిరుద్యోగం పెరుగుతుందని, నల్లధనం తీసుకురాటంలో విఫలమయ్యారని, దేశంలో ఇప్పటికే వంద లక్షల కోట్లు అప్పుచేసి దేశన్న దివాలా తీసే ప్రయత్నం మోడీ ప్రభుత్వం నేడు చేస్తుందని ఆయన విమర్శించారు. దేశంలో ప్రజాస్వాముకంగా ఎన్నికలు జరిగితే వాటిని అపహాస్యం చేసే విధంగా ఎమ్మెల్యేలను, ప్రజాప్రతినిధుల కొనుగోలు చేసి ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడిన ప్రభుత్వలను కూల్చడం బీజేపీ ముందూ వున్నదని, ఏ రాష్ట్రంలో అయితే బీజేపీకి మెజార్టీ లేని రాష్ట్రాలలో ప్రభుత్వాలను ఎమ్మెల్యేలు కొనుగోలు చేసి ప్రభుత్వాలనుకోలు చేసే ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తూ, భారత రాజ్యాంగానికి అవమానపరిచే విధంగా మోడీ వ్యవహరిస్తున్నారని ఇది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు.

కేంద్రంలో బీజేపీ సర్కార్ రోజురోజుకు నిత్యాసం ధరలు పెరుగుతున్న నియంత్రించడంలో ఆ పార్టీ ఘోరంగా విఫలం చెందిందని, కూరగాయలు, పప్పులు, పాలు, పండ్లు ధరలు విపరీతంగా పెరిగాయని టమాటా ధర 100 నుండి 150 చేరుకుందని తెలిపారు. కేంద్ర వైఫల్యానికి టమాట ధరలే ప్రత్యక్ష ఉదాహరణ అని తెలిపారు. ధరల స్థిరీకరణ కొరకు అన్ని రాష్ట్రాలకు డబ్బులు కేటాయించి, సబ్సిడీలు పై నిత్యవసర వస్తువులు సరఫరా చేయాలని ఆయన సూచించారు. టోకు వ్యాపారులకు కనక వర్షం కురిపించడం కోసమే మోడీ ప్రభుత్వం ధరల నియంత్రణ చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు.

ప్రభుత్వ సంస్థలను కార్పోరేట్ సంస్థలకు అప్పజెప్తున్న కేంద్ర ప్రభుత్వం..నున్న

దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ దోపిడీగాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అప్పనంగా ప్రభుత్వ ఆస్తులను అప్పజెప్పుతోందని రైల్వే , ఎల్ఐసీ, బొగ్గుదనులు, కరెంటు, సహజ వనరులను, ప్రజల భాగస్వామితో ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వ రంగ సంస్థలన్నీ నేడు ప్రధానమంత్రి మోడీ ఆధ్వర్యంలో దేశాన్ని దోచుకునే కార్పొరేట్ దోపిడీగాల చేతుల్లో ఆయన పెడుతున్నారని, దేశానికి, ప్రజలకు ఎంతో ప్రమాదకరమని, చంద్ర మండలానికి పంపించే ఉపగ్రహాల తయారీ దగ్గర నుండి, భూ మండలం పై సహజసిద్దంగా దొరికే గాలి, నీరు, బొగ్గు, కరెంటు తదితర సహజ వనరులను గడిసిన తొమ్మిది సంవత్సరాల కాలంలో మోడీ ప్రభుత్వం కార్పోరేట్ సంస్థకు దోచిపెడుతుందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు ఉన్న నాగేశ్వరరావు ఆరోపించారు.

సోమవారం ఉదయం మొత్తం మన రాజకీయాలు అనే అంశంపై ఆయన మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయని గ్యాస్, పెట్రోలు, కూరగాయలు, వంటనూనె, తదితర ధరలు పెంచుతూ సామాన్యుడు పై మోయలేని భారాలు మోస్తున్నారు. అలాగే రైతులకు ఎరువుల సబ్సిడీలో 50% కోత, ఉపాధి పనులకు అందిస్తున్న బడ్జెట్ నిధిలో కోతలు విధిస్తున్నారని, సబ్సిడీలపై మోడీ ప్రభుత్వం మాత్రం కార్పొరేట్ సంస్థలుకు లాభాలు తిసుకుని వచ్చే నిర్ణయాలను పార్లమెంటులో ఆమోదిస్తుందని. ఇది ప్రజల పై మోయలేని భారం పడుతుందని ఆయన విమర్శించారు. రానున్న ఎన్నికల్లో మోడీ గద్దె దిగటం ఖాయమని గుర్తు చేశారు. శిక్షణ తరగతులకు ప్రారంభానికి ముందుగా తెలంగాణ రైతు సంఘం సంఘం సీనియర్ నాయకులు ఏలూరి రంగారావు సంఘం జెండాను ఎగరవేశారు. బిక్కసారి గంగాధర్ అధ్యక్షతన జరిగిన ఈ తరగతుల్లో ప్రిన్సిపల్ గా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు వ్యవహరించారు.

శిక్షణ తరగతులకు ప్రారంభానికి ముందుగా తెలంగాణ రైతు సంఘం సంఘం సీనియర్ నాయకులు ఏలూరి రంగారావు సంఘం జెండాను ఎగరవేశారు. బిక్కసారి గంగాధర్ అధ్యక్షతన జరిగిన ఈ తరగతుల్లో ప్రిన్సిపల్ గా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మాదినేని రమేష్, రాష్ట్ర నాయకులు బండి రమేష్, గొడవర్తి నాగేశ్వరరావు, ఎస్.కె మీరా, ప్రసాద్, జిల్లా నాయకులు సన్మంత రావు, యడవల్లి రమణారెడ్డి, మండల అధ్యక్షులు తోటకూరి రాజు, జిల్లా నాయకులు రచ్చ నరసింహారావు, అశోక్, మల్లెపల్లి గ్రామ సర్పంచ్ పొట్టపింజర నాగేశ్వరరావు, రైతు సంఘం జిల్లా, మండల, నాయకులు తదితరులు పాల్గొన్నారు.



Next Story