- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
అధికారం ముఖ్యం కాదు..శక్తి మేరకు అభివృద్ధి పనులు చేశా: తుమ్మల

దిశ, కూసుమంచి: ఖమ్మం జిల్లా కూసుమంచి మండల పరిధిలోని లోక్య తండాలో అడిషనల్ డీసీపీ స్వర్గీయ బాలు జాదవ్ విగ్రహానికి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. భగవంతుడు ఇచ్చిన శక్తి మేరకు అభివృద్ధి పనులు చేశానని, మిగిలి ఉన్న పనులు కూడా అధికారులతో మాట్లాడి పూర్తి చేయిస్తా అన్నారు.
నియోజకవర్గంలో జాతీయ రహదారులు రావడంతో భూముల రేట్లు పెరిగాయన్నారు. అలాగే తాను ఉన్నంత కాలం నమ్ముకున్న ప్రజలకు మంచి చేయాలని రైతులు కూడా వ్యవసాయం లో లాభసాటి పంటలు సాగు చేయాలని తెలిపారు. అధికారం ముఖ్యం కాదు, అభివృద్ధి తోనే కళ అని ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. అనంతరం జక్కేపల్లి గ్రామంలో ఇటీవల కాలంలో మృతి చెందిన ఎస్పీ రెడ్డి మృతి చెందడంతో వారి కుటుంబాన్ని పరామర్శించారు.
అలాగే పెరిక సింగారం గ్రామానికి చెందిన మాజీ సీడీసీ చైర్మన్ టీఆర్ఎస్ నాయకుడు జుకురి గోపాల్ రావు ఇంట్లో కార్యకర్తలతో ఆప్యాయతగా కలుసుకొని గోపాల్ రావు ఇచ్చిన తేనేటి విందు ను స్వీకరించి త్వరలో కలుద్దాం అంటూ తిరుగు ప్రయాణంలో ఖమ్మం వెళ్ళారు. తుమ్మల వెంట సాదు రమేష్ రెడ్డి, బోల్లంపల్లి సుధాకర్ రెడ్డి, మాదాసు ఉపేందర్ రావు, జొన్నల గడ్డ రవి, బారి వీరభద్రం, కేశవ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ వడ్త్యా రామచంద్రునాయక్, నేలకొండపల్లి మార్కెట్ మాజీ చైర్మన్ వడ్తియా సెట్రామ్ నాయక్, ధర్మ నాయక్, రాములు నాయక్, గ్రామస్థులు గిరిజనలు వివిధ టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కొండ మహిపాల్, జనార్ధన్ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.