తమ్మినేని మర్డర్ కేసు సీబీఐకి అప్పగించాలి: రేణుకా చౌదరి డిమాండ్

by Satheesh |
తమ్మినేని మర్డర్ కేసు సీబీఐకి అప్పగించాలి: రేణుకా చౌదరి డిమాండ్
X

దిశ, ఖమ్మం రూరల్: తమ్మినేని కృష్ణయ్య హత్య యావత్​జిల్లానే సిగ్గుపడే చర్య అని కేంద్రమాజీ మంత్రి రేణుకాచౌదరి అన్నారు. సొమవారం రూరల్​మండలం తెల్దారుపల్లి గ్రామంలో ఇటీవల దారుణ హత్యకు గురైన తమ్మినేని కృష్ణయ్య కుటుంబాన్ని ఆమె పరామర్శించి.. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఇటువంటి హత్య రాజకీయాలు ఈ కాలంలో చెల్లవన్నారు. అధికారిక ప్రూఫ్‌లు ఉన్నాయని, పోలీసు అధికారులు తమ డ్యూటీ ప్రకారం రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారం ప్రవర్తిస్తే సరేసరి.. లేకపోతే నేను ప్రతి రోజు తెల్దారుపల్లి వస్తానని, ఇక్కడ మూడు రంగుల జెండాను ఎత్తుతానని అన్నారు. గ్రామంలో ఆడవాళ్లు, పిల్లలు నిర్భయంగా తిరిగేందుకు అధికారులు తగు చర్యలు తీసుకోవాలన్నారు.

ఐక్యతతో నిలబడి కేసుపై పోరాటం చేస్తామని తెలిపారు. ఎదురుగా ఢీకొట్టే దమ్ములేక దొంగచాటు రాజకీయాలు చేయడం సరికాదన్నారు. పార్టీలు రాజకీయాలతో సంబంధం కాదని మంచి వాళ్లకు జరిగిన ఆన్యాయంపై పోరాటం మాత్రమే అన్నారు. ఈ కేసు పోలీసులకు చేతకాదు కాబట్టి.. సీబీఐ పరిశీలనకు వెళ్లాలని డిమాండ్​చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం క్రిష్ణయ్య ఇంటి పక్కనే సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వీరభద్రం నిర్మిస్తున్న ఇంటిని ఆమె పరిశీలించి, కేసు పురోగతి గురించి రూరల్​ సీఐ శ్రీనివాస్‌ను అడిగి తెలుసుకున్నారు. పరారిలో ఉన్న నిందితులను వెంటనే పట్టుకోవాలన్నారు. ప్రధాన నిందితులను పట్టుకోవడంలో పోలీసులు ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్​కమిటీ చైర్మన్​మానుకొండ రాధకిషోర్, కళ్లేం వెంకటరెడ్డి, మద్ది శ్రీనివాసరెడ్డి, ధరావత్​రామ్మూర్తినాయక్, రామసహాయ మాధవరెడ్డి, కన్నేటి వెంకన్న, కేతినేని వేణు, శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.



Next Story

Most Viewed