- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
అటవీ శాఖ అధికారి హత్య ప్రభుత్వ వైఫల్యమే : ప్రొఫెసర్ కోదండరాం

దిశ, చండ్రుగొండ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలోని ఎర్రబోడు గొత్తి కోయల సమస్య ను చట్ట పరిధిలో పరిష్కరించుకోవాలని , వారిని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించడం సరైనదికాదని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. శుక్రవారం ఆయన ఎర్రబోడును సందర్శించారు. ముందుగా ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు హత్యకు గురైన ప్రదేశాన్ని పరిశీలించారు. ఆయన మృతి పట్ల ఆ కుటుంబానికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం గొత్తికోయలను కలిసి వారి సమస్యలను అడగి తెలుసుకొని నివేదిక రాసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోడుభూముల విషయంలో ప్రభుత్వం ఫారెస్ట్ ఆఫీసర్లను వేధింపులకు గురి చేయడంతో ఎస్ఆర్ ఓ హత్యకు గురయ్యాడని, ఆయన మృతికి ప్రభుత్వ వైఫలమే కారణమని ఆరోపించారు. ఎఫ్ఆర్ఓ మృతి పై జుడీషియల్ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. గొత్తికోయల విషయంలో ట్రైబల్ వెల్ఫేర్ శాఖలు స్పందించక పోవడం విచారకరమని అన్నారు. ఎర్రబోడులో ఇద్దరు చేసిన తప్పుకు అదరినీ బహిష్కరించాలని తీర్మానం చేయడం సరికాదని తెలిపారు. ఎర్రబోడులోని వలస ఆదివాసీలకు తాగునీరు , విద్య , వైద్యం , కరెంట్ , రోడ్డు లాంటి మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. మండల కేంద్ర మైన చండ్రుగొండ లో గొత్తికోయలకు పది ఎకరాల ఐటిడిఏ , ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ నివేదికను గవర్నర్ , ట్రైబల్ వేల్ఫేర్ , హ్యూమన్ రైట్ కమిషన్లకు అందచేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్ రాష్ట్ర కార్యదర్శులు మల్లెల రామనాధం , గోపగాని శంకర్ రావు , అంబటి శ్రీనివాస్ , బైరి రమేశ్, సత్యనారాయణ, షేక్ నబీ సాహెబ్ , దేవదానం , భరత్ , రవీందర్ , మల్లేశ్ , భరత్ చంద్ర, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.