- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఖమ్మంలో ఫారెస్ట్ ఆఫీసర్ హత్య ఘటన మరవకముందే మరో దారుణం

దిశ, సత్తుపల్లి: ఖమ్మంలో ఫారెస్ట్ ఆఫీసర్ హత్య ఘటన మరవకముందే మరో దారుణం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే... ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం బ్రహ్మళకుంట గ్రామ శివారులో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కాళీ ప్రభుత్వ ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని దుండగులు దగ్ధం చేశారు. అటవీ జంతువుల కోసం కొందరు వేటగాళ్లు కరెంటు వైర్లు పెడుతున్నారు అన్న సమాచారంతో అటవీ సమీపంలో గల వరి పొలంలో తన ద్విచక్ర వాహనం పార్క్ చేసి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కాళీ అడవిలోకి వెళ్లారు.
ఈ క్రమంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ద్విచక్ర వాహనాన్ని దగ్ధం చేశారు. సమీప రైతులు సెక్షన్ ఆఫీసర్ కు పోన్ చేసి బైక్ తగలపడుతున్న విషయం ను తెలపటం తో బైక్ వద్దకు వచ్చేసరికి అప్పటికి పూర్తిగా దగ్ధం అయ్యింది. ఈ ఘటనపై సదరు సెక్షన్ ఆఫీసర్ కాళీవి ఎం బంజర్ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా బైక్ కు మంటలు అంటుకుని ఉంటాయా లేక కావాలనే నిప్పు అంటించి ఉంటారా అనే కోణంలో పోలీసు దర్యాప్తు చేపట్టారు. అయితే చండ్రుగొండ మండలం బెండాలపాడు ఘటన మరవక ముందే మరో ఘటన చోటు చేసుకొవటంతో ఫారెస్ట్ అధికారులు ఉలిక్కిపడ్డారు.