- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ముంపు బాధితులకు ముద్ద కరువు

దిశ, భద్రాచలం : ముంపు బాధితులకు ముద్ద కరువు అవుతుంది. గోదావరి ముంపు బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించిన అధికారులు నాణ్యమైన ఆహారం ఇవ్వడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయు. భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య పునరావాస కేంద్రాల పరిశీలనలో ముంపు బాధితులు గగ్గోలు పెట్టారు. భద్రాచలం పట్టణం జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన సుభాష్ నగర్ కాలనీ ముంపు ప్రాంత వాసుల పునరావాస కేంద్రాన్ని భద్రాచలం శాసనసభ్యులు పొదెం వీరయ్య సందర్శించి ముంపు ప్రజలను పరామర్శించారు. సమయానికి వారికి భోజనం పెట్టాలని అధికారులతో రివ్యూ చేసి భోజనాలు స్వయంగా వడ్డించారు.
ఈ సందర్భంగా పునరావాస కేంద్రంలో ఉన్నముంపు బాధితులు శాసనసభ్యులు దృష్టికి పలు సమస్యలు తీసుకొచ్చారు. భోజన నాణ్యత బాగోలేదని తెలియజేయగా, అడిషనల్ కలెక్టర్కి, భద్రాచలం తహసీల్దార్కి ఈ విషయమై వెంటనే నాణ్యమైన భోజన సదుపాయాన్ని సమయానికి కల్పించాలని ఆదేశించారు. ఆయనతో పాటు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సరెళ్ల నరేష్, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షులు చింతిర్యాల రవి కుమార్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు భోగాల శ్రీనివాస్ రెడ్డి, బంధం శ్రీనివాస్ గౌడ్, బలుసు సతీష్, వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రదీప్ , బొంత రమణ, సరెళ్ల వెంకటేశు, పందాల సరిత, దేవకీ పాల్గొన్నారు.