చేప పిల్లల పంపిణీలో ఫ్లెక్సీల లొల్లి.. గంటసేపు నిలిచినపోయిన కార్యక్రమం

by S Gopi |
చేప పిల్లల పంపిణీలో ఫ్లెక్సీల లొల్లి.. గంటసేపు నిలిచినపోయిన కార్యక్రమం
X

దిశ, దమ్మపేట: దమ్మపేట ఎంపీడీవో కార్యాలయం వద్ద చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని టీఆర్ఎస్ నాయకులు కొద్దిసేపు నిలిపివేశారు. మత్స శాఖ అధికారులు చేప పిల్లల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన సందర్భంలో వారు ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫొటోలు మాత్రమే ఉండటం స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు ఫొటో లేకపోవడంతో, నియోజకవర్గ పరిధిలో జరిగే కార్యక్రమంలో ఎమ్మెల్యే ఫొటో లేకుండా, ప్రభుత్వం అందించే చేప పిల్లలను ఎలా పంపిణీ చేస్తారని, జిల్లా మత్స్యశాఖ అధికారి వీరన్నను అక్కడ ఉన్న దమ్మపేట ఉప సర్పంచ్ దారా యుగంధర్ మరియు టీఆర్ఎస్ నాయకులు ప్రశ్నించారు. గంటపాటు పంపిణీ కార్యక్రమం ఆగిపోయింది. హుటాహుటిన మత్స్య శాఖ అధికారులు ఎమ్మెల్యే ఫొటో ఉన్న మరో ఫ్లెక్సీని ఏర్పాటు చేసి దమ్మపేట ఎంపీపీ సోయం ప్రసాద్ చేతుల మీదుగా చేప పిల్లలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దమ్మపేట సర్పంచ్ ఉయ్యాల చిన్న వెంకటేశ్వరరావు, ఎంపీడీవో చంద్రశేఖర్, కొయ్యల అచ్యుతరావు, యార్లగడ్డ బాబు, పానుగంటి చిట్టిబాబు, కవులూరి నాగయ్య, గజుబోయిన యేసు తదితరులు పాల్గొన్నారు.





Next Story

Most Viewed