సొంత పనులకు వాడిన గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌.. రైతుకు జరిమానా

by Vinod kumar |
సొంత పనులకు వాడిన గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌.. రైతుకు జరిమానా
X

దిశ, తిరుమలాయపాలెం: ఫ్రీగా వస్తుందని ఓ రైతు గ్రామపంచాయతీ ట్రాక్టర్​ను సొంత పనులకు వాడాడు. ఈ విషయం కాస్తా సోషల్​ మీడియాలో వైరల్​ కావడంతో అధికారులకు తెలియడంతో రూ.5 వేలు జరిమానా విధించడంతో నగదు కట్టి జైలుకు పోకుండా బయటపడ్డాడు. ఈ ఉదంతం మండలంలోని మహ్మదాపురం గ్రామంలో బుధవారం వెలుగుచూసింది. వివరాల్లోకెళితే.. గ్రామంలోని చెత్త సేకరించిన అనంతరం మల్టీ పర్పస్ సిబ్బంది అయిన భూక్యా రాజేష్ తండ్రి పత్యా గ్రామ పంచాయతీ కార్యదర్శి,సర్పంచుకు తెలియకుండా తన సొంత పొలం పనులకు పంచాయతీ ట్రాక్టర్ ను వినియోగించాడు.


వరి నూర్పిడి యంత్రం మిషన్ కి సహాయంగా పంచాయతీ ట్రాక్టర్ వాడుతున్న వీడియోలు, ఫొటోస్ కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి కాస్తా వైరల్ అయ్యాయి. వెంటనే స్పందించిన పంచాయతీ కార్యదర్శి యాకయ్య ట్రాక్టర్ ను దుర్వినియోగం చేసిన పత్యాకు రూ.5,000 వేలు జరిమానాతోపాటు షోకాజ్ నోటీసు ఇచ్చారు. దీంతో చేసేది ఏమీ లేక జరిమానా డబ్బులు కట్టాడు.





Next Story

Most Viewed