వెంకన్న కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన షర్మిల

by S Gopi |
వెంకన్న కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన షర్మిల
X

దిశ, కూసుమంచి: పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలం ముత్యాలగూడెం గ్రామంలో ఇటీవల మరణించిన బొల్లికొండ వెంకన్న కుటుంబాన్ని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆదేశానుసారం ఆమె వ్యక్తిగత సహాయకుడు నంద్యాల రవీందర్ రెడ్డి ఆదివారం పరామర్శించి వారి కుటుంబానికి రూ.25 వేల రూపాయలను అందజేశాడు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ అధికార ప్రతినిధి పసుపులేటి సైదులు మండల అధ్యక్షులు వైవి రెడ్డి, వూడుగు సుధాకర్ బానోత్ కిషోర్ నాయక్, ఉపేందర్, కృష్ణ, నగేష్, కొక్కిరేణి రమేష్, నాగేశ్వరరావు, ముత్యాలగూడెం గ్రామ సర్పంచ్ బొల్లికొండ శ్రీను, దాసరి వెంకన్న, పాసిని ప్రభాకర్, మహిళలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.



Next Story

Most Viewed