ఘోర ప్రమాదం...ఆటో బోల్తాపడి నలుగురు మృతి

by Sridhar Babu |
ఘోర ప్రమాదం...ఆటో బోల్తాపడి నలుగురు మృతి
X

దిశ, బూర్గంపాడు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల శివారు ఆంధ్రప్రదేశ్-తెలంగాణ సరిహద్దులో బుధవారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. అదుపు తప్పి కిన్నెరసాని బ్రిడ్జి పైనుండి ఆటో బోల్తా పడింది. ఇందులో ప్రయాణిస్తున్న ఎనిమిది మందిలో ఆరుగురికి తీవ్ర గాయాలైయ్యాయి. అందులో నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. ఏపీలోని ఏలూరు జిల్లా టి నర్సాపురం మండల పరిధిలోని తిరుమలదేవిపేట గ్రామానికి చెందిన భక్తులు భద్రాచలం రామయ్యను దర్శించుకుని తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

క్షతగాత్రులను భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా అక్కడ జట్ల దుర్గారావు, పచ్చిపాల శ్రీనివాసరావు చికిత్స పొందుతూ మృతి చెందారు. అలాగే బూర్గంపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో ఇద్దరు చిన్నారులు కూడా మృతి చెందారు. గాయపడిన నరసింహారావు, తిరుమలరావు, నిర్మల, అనూషలు చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న బూర్గంపాడు ఎస్ఐ సంతోష్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.



Next Story