పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి

by Sridhar Babu |
పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి
X

దిశ ఖమ్మం టౌన్ : తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలకు నష్ట పోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని బీజేపీ జాతీయ నాయకులు, తమిళనాడు సహా ఇంచార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. బుధవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్టం లో అకాల వర్షాల వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని, పరిహారం 50 వేలు ఇవ్వాలని అన్నారు. ఖమ్మంలో రైతులకు బేడీలు వేసిన ప్రభుత్వం మహారాష్ట్ర లో రైతు ప్రభుత్వం తెస్తామనడం హాస్యస్పదంగా ఉందన్నారు. కేటీఆర్ ప్రధాన మంత్రి, బీజేపీ సంగతి తేలుస్తా అంటున్నాడని, కానీ మోడీ కార్యాలయం గేట్ కూడా తకలేడు అన్నారు.

అక్రమ వ్యాపారంలో బీఆరెఎస్ నాయకులు బిజీ గా ఉన్నారని పేర్కొన్నారు. బంగారు తెలంగాణ అని చిలక పలుకులు పలుకుతూ ప్రజలకు చిప్ప చేతికి ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. సీపీఎం, సీపీఐ రెండు కూడా కేసుల నుండి బయట పడేందుకు, ఒక సిటు కోసం కేసీఆర్ కి లొంగిపోయారని పేర్కొన్నారు. కాంగ్రెస్ తన ఉనికి కోల్పోయిందని, రాష్ట్రం లో బీజేపీ లోకి ఎవరు వచ్చినా స్వాగతిస్తాం అని స్పష్టం చేశారు. ఈ నెల 30న ప్రధాన మంత్రి మాన్ కి బాత్ 100వ ఎపిసోడ్ ప్రతి సెంటర్ లో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం అన్నారు. ఈ సమావేశం లో జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు మంద సరస్వతి, శ్యామ్, విజయరెడ్డి తదితరులు ఉన్నారు.



Next Story

Most Viewed