- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
కోతుల బెడదను నియంత్రించాలని రైతులు ధర్నా

దిశ, కారేపల్లి : పంటలకు కోతుల బెడద ఎక్కువైందని వాటి నుండి పంటలను రక్షించాలని, సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో శనివారం తహసీల్ధార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కోతుల మూకతో పంటలను రక్షించలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి తహసీల్ధార్ కోట రవికుమార్కు వినతిపత్రం అందజేశారు. ఈ ధర్నాను ఉద్దేశించి రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దుగ్గి కృష్ణ మాట్లాడుతూ.. అధిక వర్షాలతో పంటలు దెబ్బతిన్నా ప్రభుత్వం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుందని విమర్శించారు.
పండిన కొద్ది పంట దిగుబడికి ధర లేక అప్పుల పాలై పరిస్ధితి కనిపిస్తుందన్నారు. పత్తి పంట రైతు చేతికి వస్తున్న దశలో.. పత్తి రేటును అమాంతరం తగ్గిస్తున్నారని దీని నివారణకు ప్రభుత్వ రంగ సంస్ధ సీసీఐని రంగంలోకి దింపి రూ. 12 వేలు మద్దతు ధరకు పత్తి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కోతుల బెడత తీవ్రంగా ఉందని వాటి నియంత్రణకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టి పంటలను కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ వడ్డె అజయ్బాబు, రైతు సంఘం నాయులు వజ్జా రామారావు, ముండ్ల ఏకాంబరం, తలారి దేవప్రకాశ్, పిప్పళ్ల కృష్ణ, షేక్ సైదులు, మాలోత్ రాంకోటి, సోందు, బారు నర్సింహరావు, కొండెబోయిన నాగేశ్వరరావు, కే.నరేంద్ర తదితరులు ఉన్నారు.