- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
విద్యుత్ షాక్తో యువ రైతు మృతి.. అధికారుల నిర్లక్ష్యమే కారణం..

దిశ, వేంసూర్: ఖమ్మం జిల్లా వేంసూర్ మండలం కొత్త చౌడవరం గ్రామానికి చెందిన ఊట్ల శ్రీను (45) తన తండ్రి తో కలసి ఉదయాన్నే వ్యవసాయ పొలానికి వెళ్లాడు. అక్కడ పనులు ప్రారంభించేముందు నీళ్ల మోటారు ఆన్ చేద్దామని ఫెన్సింగ్ దాటే ప్రయత్నాం చేశాడు. ఈ క్రమంలో ఫెన్సింగ్ దాటుతుండగా ఫెన్సింగ్కు విద్యుత్ సరఫరా అవుతుండటంతో శ్రీనుకు విద్యుత్ షాక్ కొట్టింది. విద్యుత్ తీవ్రతకు శ్రీను అక్కడికక్కడే మృతి చెందాడు. వర్షాకాలంలో విద్యుత్ లైన్లు, మోటార్లు, ట్రాన్స్ఫార్మర్స్పై పర్యవేక్షణ చేయవలసిన విద్యుత్ శాఖ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, ఇలాంటి ప్రమాదాలు తరచుగా అక్కడక్కడ జరుగుతున్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని, రైతులకు అవగాహన కల్పించకపోగా నిర్లక్ష్య ధోరణి కూడా ఎక్కువైందని రైతులు వాపోతున్నారు. ఇకనైనా విద్యుత్ శాఖ సిబ్బంది పర్యవేక్షించి ఈ లోపాలను సరి చేయాలని వారు కోరుతున్నారు.