జేసీబీ తగిలి రైతు దుర్మరణం

by Sridhar Babu |
జేసీబీ తగిలి రైతు దుర్మరణం
X

దిశ, వైరా : వైరా మండలంలోని సోమవారం - కోష్టాల గ్రామాల మధ్య ఉన్న వైరా రిజర్వాయర్ కుడి కాల్వ 7వ నెంబర్ తూము వద్ద పనులు చేస్తున్న జేసీబీ తగిలి ఓ రైతు దుర్మరణం చెందాడు. ఈ ప్రమాదంలో వైరా పట్టణానికి చెందిన రైతు ఉయ్యూరు నరసింహారావు (70) మృతి చెందారు. కుడి కాలువ 7వ నెంబర్ తూము శిథిలావస్థకు చేరడంతో నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో మరమ్మతులు చేపట్టారు. పాత తూమును తొలగించి కొత్త తూమును ఏర్పాటు చేసేందుకు మంగళవారం జేసీబీతో పనులు చేపట్టారు.

ఆ తూము సమీపంలో తనకున్న రెండు ఎకరాల పొలంలో కూరగాయలు సాగు చేస్తున్న ఉయ్యూరు నరసింహారావు పనులు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లాడు. అయితే ప్రమాదవశాత్తు జేసీబీ టైరు తగిలి నరసింహారావు తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన కాలు చేయి విరిగిపోయాయి. దీంతో అతనిని ఖమ్మంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతునికి భార్య పుష్పావతి ఇద్దరు కుమారులు ఉన్నారు. వైరా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



Next Story