ఓటమి భయంతోనే బీఆర్ఎస్ నాయకుల తప్పుడు ప్రచారం

by Sridhar Babu |
ఓటమి భయంతోనే బీఆర్ఎస్ నాయకుల తప్పుడు ప్రచారం
X

దిశ, ఇల్లందు : రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించడం సిగ్గుమాలిన చర్యని భద్రాద్రి కొత్తగూడెం జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య అన్నారు. గురువారం ఇల్లందు పట్టణంలోని ఐ.ఎన్.టి.యూ.సీ కార్యాలయంలో జరిగిన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు కేటాయించిన 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా పేరుతో చేస్తున్నటువంటి అవినీతి, అక్రమాలపై రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను వక్రీకరిస్తూ బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన అసత్యపు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ దంపతులకు రాజకీయ భిక్ష పెట్టిన రేవంత్ రెడ్డి పై, కాంగ్రెస్ పార్టీ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. వ్యవసాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించేందుకు రైతు వేదికలను ఏర్పాటు చేయడం జరిగిందని ఓ వైపు చెప్పుకుంటూ, మరోవైపు అదే రైతు వేదికలను పార్టీ కార్యాలయాల్లా వాడుకోవడం సిగ్గుచేటన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్ నేతలు తప్పుడు ఆరోపణలు, నిరసనల పేరిట ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. ఇల్లందుకు బస్ డిపో తీసుకువచ్చాము అని పదే పదే గొప్పలు చెప్పడానికే తప్ప,నేటికీ ప్రారంభానికి నోచుకోకుండా కేవలం మందుబాబులకు అడ్డాగానూ, గోడలపై మీ బొమ్మలు వేసుకోవడానికే ఉపయోగపడిందే తప్ప ప్రజలకు ఫలితం మాత్రం శూన్యం అన్నారు. సీతారామ ప్రాజెక్ట్ నీటి తరలింపు విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరి ఒక్కసారి నిశితంగా గమనిస్తే మీ కళ్ళకు కమ్ముకున్న కారు మబ్బులు తేలిపోతాయని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే హరిప్రియనాయక్ దంపతుల తుగ్లక్ పాలన సహించలేకనే బీఆర్ఎస్ పార్టీలోని తిరుగుబాటు నేతలు అధిష్టానం వద్ద కొత్త నేతల పేర్లు ప్రతిపాదిస్తున్నా వీరి తీరు మార్చుకోకపోవడం హాస్యస్పదం అన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు భూక్యా ధల్ సింగ్ నాయక్, పట్టణ అధ్యక్షులు దొడ్డా డానియేలు, పట్టణ ప్రధాన కార్యదర్శి మహ్మద్ జాఫర్, ఇల్లందు మండల అధ్యక్షులు పులి సైదులు, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్ కోరి, జీవీ భద్రం, వాసుదేవ లోధ్, మహమూద్ ఇబ్రహీం, ఈశ్వర్ గౌడ్, వెంకట్ నారాయణ, సర్పంచులు తాటి చుక్కమ్మ, ఛాట్ల భాగ్యమ్మ, ఎంపీటీసీ లు మండల రాము, పూనెం సురేందర్, పాయం కృష్ణప్రసాద్, నాయకులు మడుగు సాంబమూర్తి, బోళ్ల సూర్యం, చిల్లా శ్రీనివాస్, నంద కిషోర్,నెల్లూరి సైదులు, తాటి భిక్షం,ఊరుగొండ ధనుంజయ్, బానోత్ శారదా, గుగ్లోత్ నాగార్జున, రావూరి సతీష్, బొల్లి రాజు, ప్రసన్న కుమార్ యాదవ్, కుంటా రాజు, అజ్జు, శేఖర్ పాల్గొన్నారు.



Next Story

Most Viewed