జర్నలిస్టులపై కక్ష సాధింపు అత్యంత దుర్మార్గం : టీడబ్ల్యూజేఎఫ్

by Kalyani |
జర్నలిస్టులపై కక్ష సాధింపు అత్యంత దుర్మార్గం : టీడబ్ల్యూజేఎఫ్
X

దిశ బ్యూరో, ఖమ్మం: సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి విజయవాడలోని ఇంటిపై ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు దాడి చేయడాన్ని టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తోందని జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసిన జర్నలిస్టులపై కేసులు నమోదు చేయడం, కక్ష సాధింపు చర్యలకు దిగడం అత్యంత దుర్మార్గం అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలు ప్రజా మన్ననలు చూరగొనే విధంగా పాలన చేయాలి తప్ప, వ్యతిరేక వార్తలు రాశారని జర్నలిస్టులను భయభ్రాంతులకు గురి చేసే చర్యలకు దిగడం అత్యంత హేయనీయమని అన్నారు.

గతంలోనూ సాక్షి అకౌంట్లు ఫ్రీజ్ చేసి ఆ సంస్థ ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడారని గుర్తు చేశారు. ప్రభుత్వాలు ఏమున్నా జర్నలిస్టులు తమ విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తారు అనే విషయాన్ని పాలకులు గుర్తుంచుకోవాలన్నారు. లిక్కర్ స్కామ్ లో నిందితులు ఎడిటర్ ఇంట్లో ఉంటారని దాడులు నిర్వహించడం హాస్యాస్పదమన్నారు. పత్రికా స్వేచ్ఛ, వ్యక్తిగత స్వేచ్ఛలకు భంగం కలిగేలా ఇటువంటి దాడులు నిర్వహించడాన్ని టీ డబ్ల్యూజేఎఫ్ మరోసారి ఖండిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా నాయకులు సయ్యద్ ఖదీర్, దువ్వా సాగర్, కూరాకుల గోపీ, యెగినాటి మాధవరావు, మూర్తి, మధుశ్రీ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed