- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
వైరాలో "మమతల" అవినీతి రాగం

దిశ, వైరా : వైరా ఎక్సైజ్ స్టేషన్ అంతా మమతల అవినీతి రాగంలో కొనసాగుతుంది. ఎక్సైజ్ అధికారులు కాసులకు కక్కుర్తి పడి పేదల పై తన ప్రతాపాన్ని చూపిస్తున్నారు. ప్రైవేటు వ్యక్తులతో వైరాలోని ఓ అధికారి తన సైన్యం ఏర్పాటు చేసుకున్నారు. వైరా ఎక్సైజ్ స్టేషన్ కు కూతవేటు దూరంలో 24 గంటలు మద్యం అమ్మిన అధికారులు మాత్రం కనీసం పట్టించుకోరు. శాంతినగర్ కేంద్రంగా 24 గంటలు నిరంతరాయంగా మద్య విక్రయాలు కొనసాగుతున్నాయి. నెలవారీ మామూలు మత్తుకు అలవాటు పడిన ఎక్సైజ్ అధికారులు కనీసం 24 గంటలు నడిచే బెల్ట్ షాపుల పై చర్యలు తీసుకోరు. కానీ ఓ అధికారి నియమించిన ప్రైవేటు సైన్యం మాత్రం దాడులు చేస్తుంది. అర్ధరాత్రి, అపరాత్రి అని లేకుండా ఆ అధికారి నియమించుకున్న ప్రైవేట్ సైన్యం బెల్ట్ షాపుల పై దౌర్జన్యాన్ని పాల్పడుతుంది.
ఇళ్లల్లో ఉన్న కుర్చీలు కూడా ఆ ప్రైవేట్ సైన్యం ఇరగ కొడుతుంది. వైరా మండలంలోని అష్టగుర్తి గ్రామానికి చెందిన ఓ బెల్ట్ షాప్ దుకాణ యజమాని వైరాలోని ఓ మద్యం దుకాణంలో మద్యం కొనుగోలు చేసి తీసుకెళ్లారు. అయితే ఓ ప్రైవేటు వ్యక్తి వచ్చి సిండికేట్ లో నువ్వు తీసుకోలేదని ఆ మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. ఓ ప్రైవేటు వ్యక్తి తీసుకున్న మద్యం బాటిల్ తెల్లారే ఎక్సైజ్ ఆఫీసులో ప్రత్యక్షమయ్యాయి. దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు దిశ చూపిస్తాయి. అందుకు ఎక్సైజ్ అధికారులు సిద్ధంగా ఉండాలి. ఇలా ఎంతో మందినో ప్రైవేట్ సైన్యంతో దాడులు చేపించి ఎక్సైజ్ అధికారులు ఎందుకు కేసు నమోదు చేస్తారో అర్థంకాని పరిస్థితి నెలకొంది. ఎక్సైజ్ ఆఫీసు కూతవేటు దూరంలో 24 గంటలు మద్యం అమ్ముతున్న వారి వద్ద నుంచి మామూలు వసూలు చేసుకుని పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా జిల్లా ఎక్సైజ్ అధికారులు స్పందిస్తారో లేదా స్థానిక అధికారులకు భజన చేస్తారో వేచి చూడాల్సిందే.