- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
రెచ్చిపోయిన మావోయిస్టులు.. తెర్రెం పోలీస్స్టేషన్పై కాల్పులు
by srinivas |

X
దిశ, భద్రాచలం : ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు పెట్రేగి పోయారు. బీజాపూర్ జిల్లా ఊసూరు బ్లాక్ పరిధిలోని తెర్రెం పోలీస్ స్టేషన్పై ఆదివారం రాత్రి మావోయిస్టు దాడి చేసి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఏఎస్ఐ రాకేష్ సూర్యవంశీ నడుముకు బుల్లెట్ తగిలింది. పోలీస్ స్టేషన్ లో ఇతర సిబ్బంది అప్రమత్తమై ఎదురు కాల్పులు జరపడంతో మావోయిస్టులు అక్కడి నుండి పారిపోయినట్లు సమాచారం. గాయపడిన ఏఎస్ఐని హుటాహుటిన జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరో ఘటనలో 6 వాహనాలకు మావోయిస్టులు నిప్పు పెట్టారు. అంతగఢ్ బ్లాక్లోని చార్గావ్లో అభివృద్ధి పనులకు ఉపయోగిస్తున్న ఆరు వాహనాలకు నిప్పు పెట్టినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story