- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఎక్కడ చూసినా ఇసుక మేటలే

దిశ, కూసుమంచి : కూసుమంచి మండలంలో టీపీసీసీ సభ్యులు రాయల నాగేశ్వరరావు శుక్రవారం పర్యటించారు. పెరికిసింగారం, జక్కెపల్లి, తుమ్మలతండా గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలతో, వరదలతో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. వేలల్లో పెట్టిబడి పెట్టి పంట సాగు చేస్తే వరదలకు పొలాల్లో ఇసుక మేట వేసిందని రైతులు రాయల దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా రాయల మాట్లాడుతూ వరదలతో పంట నష్టపోయిన రైతులను బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
వాగు పక్కన ఇరువైపులా ఉన్న పొలాలు పంట నష్టంతో పాటు ఇసుక మేట వేయటం, పూర్తిగా మట్టి కొట్టుకుపోయి రాళ్లు తేలాడం ఇబ్బందిగా మారిందన్నారు. రైతుల మోటార్లు కోట్టుకుపోయాయని, అదేవిధంగా కరెంట్ స్తంభాలు 70 విరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా ఈ నాటి వరకు అధికారులు అంచనా వేయడానికి రాలేదన్నారు. ఇప్పటికైనా వ్యవసాయ అధికారులు, రెవెన్యూ అధికారులు, పాలేరు అలుగు పక్కన నష్టం జరిగిన పొలాలను పరిశీలించి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని కోరారు.