'షాపుల ముందు లైసెన్సులు ప్రదర్శించాలి'

by Javid Pasha |
షాపుల ముందు లైసెన్సులు ప్రదర్శించాలి
X

దిశ, అశ్వారావుపేట: విత్తన, ఎరువు, పురుగుమందుల డీలర్లు లైసెన్స్‌లను షాపుల ముందు తప్పనిసరిగా ప్రదర్శించాలని భద్రాద్రి జిల్లా వ్యవసాయాధికారి అభిమన్యుడు అన్నారు. అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి ఫెర్టిలైజర్, సీడ్ డీలర్ల సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా వానాకాలం సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో డీలర్లు పాటించవలసిన నియమాలు జాగ్రత్తలపై ఆయన పలు సూచనలు చేశారు. రైతుకి ఇచ్చే బిల్లులో తప్పనిసరిగా సంతకం తీసుకొని ఇవ్వాలన్నారు. ఎరువుల్లో ఫారంను పురుగు మందుల్లో పిసీలను జతపరచుకోవాలన్నారు. విత్తన డీలర్లు తప్పనిసరిగా బిల్లు ఇచ్చి హెచ్డీ కాటన్ గురించి అప్రమత్తంగా ఉండాలన్నారు. వరిని నేరుగా విత్తడం, పిఎస్బిని వాడడం, ఎరువులను విడతలవారీగా వేయడం, పచ్చిరొట్ట ఎరువులు వాడకం వంటి పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సమావేశానికి నియోజకవర్గ స్థాయి డీలర్లు, వ్యవసాయ శాఖ అధికారులు హాజరయ్యారు.



Next Story