- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
భవిష్యత్పై భరోసా కల్పించేందుకు ఉపాధి అవకాశాలు

దిశ, సత్తుపల్లి : రాజ్యసభ సభ్యులు హెటిరో సంస్థల అధినేత డా.బండి పార్థ సారధి రెడ్డి ఆలోచన మేరకు గ్రామీణ నిరుద్యోగ యువత జీవితాలలో భవిష్యత్తుపై భరోసా కలిగించే ధ్యేయంతో సత్తుపల్లి ప్రాంత నిరుద్యోగ యువతీ యువకులకు హెటిరో సంస్థలో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్టు సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. సత్తుపల్లి మండలం గంగారం గ్రామంలోని సాయిస్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ నందు ఏర్పాటు చేసిన జాబ్ మేళా కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ఆయన ప్రారంభించారు.
నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారని, నియోజకవర్గ పరిధిలోని నిరుద్యోగులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో హెటిరో సంస్థ , సాయిస్ఫూర్తి కళాశాల యాజమాన్యం, జిల్లా గ్రంథాలయ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ కుసంపూడి మహేష్, డీసీసీబీ డైరెక్టరు గొర్ల సంజీవ రెడ్డి, ఆత్మ చైర్మన్ వనమా వాసు, దాసరి ప్రభాకర్ రెడ్డి, జైపాల్ రెడ్డి, టౌన్ పార్టీ అధ్యక్షులు షేక్ రఫీ, వార్డు కౌన్సిలర్లు అద్దంకి అనిల్, గుండ్ర రఘు, నాయకులు మేకల నరసింహారావు, పర్వతనేని వేణు పాల్గొన్నారు.