- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మూడు రోజులుగా కరెంటు బంద్

దిశ, వైరా : వైరా మున్సిపాలిటీలోని సంత బజారులో గత మూడు రోజులుగా విద్యుత్ లేక ప్రజలు అల్లాడుతున్నారు. ఒకవైపు ప్రజలు విద్యుత్ సమస్యతో నరకం చూస్తుంటే మరోవైపు అధికారులు, సిబ్బంది విద్యుత్ విజయోత్సవం సంబరాల్లో మునిగితేలుతున్నారు. సంత బజారులో ఉన్న 100 కేవీ ట్రాన్స్ఫారం పై లోడుపడి గత మూడు రోజులుగా రాత్రుల కరెంటు ఉండటం లేదు. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు సుమారు యాభై సార్లు పైగా విద్యుత్ ట్రిప్ అవుతుంది. ఈ నెల 2వ తేదీ రాత్రి నుంచి విద్యుత్ లేక ఆ ప్రాంత ప్రజలు రాత్రివేళల్లో నరకం అనుభవిస్తున్నారు. 100 కేవీ ట్రాన్స్ఫార్మర్ పై లోడ్ పడి విద్యుత్ సరఫరా నిలిచిపోతున్నా కనీసం పట్టించుకోవడం లేదు.
దీంతో ఆ ప్రాంత ప్రజలు రాత్రి వేళల్లో దోమలతో, ఊక్కపోత తో నరకం అనుభవిస్తున్నారు. తాము ఏదో ఉద్ధరించామని విద్యుత్ విజయోత్సవం చేపడుతున్న విద్యుత్ అధికారులకు స్థానిక సమస్యలు కనీసం పట్టడం లేదు. ఆదివారం రాత్రి కూడా సంత బజార్ ప్రజలు కరెంటు లేక నరకం చూస్తున్నారు. అదేవిధంగా వైరాలోని తల్లాడ రోడ్ లో ఉన్న ఎస్ ఎస్ ఎల్ రెస్టారెంట్ వద్ద ఉన్న సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫారం కాలిపోయి పది రోజులు దాటింది. దాని స్థానంలో అధికారులు ప్రత్యామ్నాయంగా విద్యుత్ సరఫరా అందిస్తున్నారు. అయితే పది రోజులు గడుస్తున్నా దాని స్థానంలో కొత్తది ఏర్పాటు చేయలేదు. తల్లాడ రోడ్ లో విద్యుత్ లో ఓల్టేజ్ తో గృహపకరణాలు కాలిపోయాయి. ఆ ప్రాంత ప్రజల సమస్యను విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు స్పందించి సంత బజారులో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించి, తల్లాడ రోడ్లో లో ఓల్టేజ్ సమస్యను వెంటనే పరిష్కరించాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు.