- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
చతుర్విద ప్రక్రియ సాధనకు కృషి చేయాలి : కలెక్టర్ గౌతమ్
by Sridhar Babu |

X
దిశ, బోనకల్లు : చదవడం, రాయడం వంటి చతుర్విద ప్రక్రియ సాధనకు కృషి చేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు. మంగళవారం బోనకల్లు మండల కేంద్రంలోని రైతు వేదికలో మధిర నియోజకవర్గ స్థాయి తొలిమెట్టు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ మౌలిక భాష, గణిత సామర్థ్యాలను విద్యార్థులకు నేర్పడంలో ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. విద్యార్థులు తొలిమెట్టు ఎక్కేలా విద్యా బోధన చేయాలని కోరారు. విద్యార్థులకు ఏ మేరకు ఫలితాలు సాధించారన్న విషయంపై దృష్టి పెట్టాలన్నారు. ఒకటో తరగతి లో జాయిన్ అయిన విద్యార్థి ఐదో తరగతి వచ్చేవరకు ఎలా తయారు చేస్తారు అని ఉపాధ్యాయులను ప్రశ్నించారు. పాఠశాలల్లోని విద్యార్థులు 100 శాతం ఫలితాలను సాధించాలన్నారు. ఈనెల 20వ తేదీ నాటికి ఫలితాలు సాధించామని ఉపాధ్యాయులు డిక్లరేషన్ పంపించాలని ఆదేశించారు.
Next Story