ఇంటింటా కాంగ్రెస్‌ పథకాల ప్రచారం

by Sridhar Babu |
ఇంటింటా కాంగ్రెస్‌ పథకాల ప్రచారం
X

దిశ, కారేపల్లి : కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే తెలంగాణలో అమలు చేసే పథకాలను టీపీసీసీ సభ్యులు దారావత్‌ రాంమూర్తినాయక్‌ ఆధ్వర్యంలో ఆదివారం కారేపల్లి మండలంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. సీతారాంపుర, కొత్తూరుతండా, మండెపల్లి, బస్వాపురం, గాదెపాడు, చింతలపాడు, మొట్లగూడెం గ్రామాల్లో ఇంటింటికి తిరిగి బీఆర్‌ఎస్‌ పథకాల వైఫల్యాలను తెలియజేస్తూ కాంగ్రెస్‌ ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను గ్రామస్తులకు వివరించారు. ఈ సందర్బంగా రాంమూర్తినాయక్‌ మాట్లాడుతూ

రైతులకు ఉచిత విద్యుత్‌ పథకం వైఎస్‌ హయాంలో ప్రవేశపెట్టారన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్‌ మహిళా ఉపాధ్యక్షురాలు పగడాల మంజుల, మాజీ ఎంపీటీసీ గడ్డం వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్‌ భద్రునయక్‌, సోషల్‌ మీడియా కోఆర్డినేటర్‌ పవన్‌ కళ్యాణ్‌, నాయకులు ఈసం రాములు, కోటి, మాలోత్‌ సక్య, ధారావత్‌ రాజు, హీరాలాల్‌, బిచ్చు, ఈసాల రాంబాబు, గుండ్ల జగన్నాథం, నాగండ్ల జగన్‌, బల్లి పాపారావు, ,ఉన్నం బుద్ధుడు, సిరికొండ రాములు, బుగ్గ సురేందర్‌, కల్తీ ఆదినారాయణ, ఉప్పునూరి సురేందర్‌రెడ్డి, పరమేశ్వర్‌రెడ్డి, భూక్య నాగేశ్వరరావు, సుడిగాలి విష్ణుమూర్తి, భానోత్‌ దేవిలాల్‌ తదితరులు పాల్గొన్నారు.



Next Story