- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
వరద బాధితులకు అన్నదానం

దిశ,ఖమ్మం రూరల్ : గత ఐదు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మండల పరిధిలోని పలు గ్రామాలు కాలనీలు వరదలో చిక్కుకున్నాయి. వరదల్లో చిక్కుకున్న ప్రజలను ప్రజా ప్రతినిధులు, అధికారులు సురక్ష ప్రాంతాలకు తరలించారు. వారికి మదర్ సాహెబ్ ట్రస్టు ద్వారా భోజనం ప్యాకెట్లను గురువారం రాత్రి అందజేశారు. మండల అధికారులు రాంలీల ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన
పునరావాస కేంద్రంలో ఉంటున్న 250 మంది కుటుంబాలకు మదార్ సాహెబ్ ట్రస్ట్ చైర్మన్ మై బిల్లి సాహెబ్ తన కుటుంబ సభ్యులతో కలిసి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుంచి ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటున్నట్టు తెలిపారు. కరోనా కష్టకాలంలో కూడా వరంగల్ క్రాస్ రోడ్ పరిధిలో ఉన్న కుటుంబాలకు ఆర్థిక సాయంతో పాటు కూరగాయలు మందులు పంపిణీ చేశామన్నారు. కార్యక్రమంలో రఫీ, కిట్టు, మున్ని తదితరులు పాల్గొన్నారు.