'దిశ' చెప్పిన అక్షర సత్యం.. నాసిరక నిర్మాణంతో కూలిపోతున్న డివైడర్

by Javid Pasha |
దిశ చెప్పిన అక్షర సత్యం.. నాసిరక నిర్మాణంతో కూలిపోతున్న డివైడర్
X

దిశ, మణుగూరు: గత వారం రోజుల నుండి మండలంలో రూ.2 కోట్లతో కాంట్రాక్టర్ నాసిరకంగా రోడ్డు, డివైడర్ నిర్మాణ పనులు చేపడుతున్నాడని మూడు రోజుల నుండి దిశ పత్రికలో కథనాలు వస్తున్నాయి. వీటిలో నిజానిజాలు శనివారంతో బట్టబయలు అయ్యాయి. సదరు కాంట్రాక్టర్ నాసిరకంగా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టి కొన్ని లక్షల రూపాయలను సొమ్ము చేసుకుంటున్నాడని దిశ అక్షర సత్యం చెప్పింది. మణుగూరు మండలంలోని అంబేద్కర్ సెంటర్ నుంచి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ వరకు 2 కోట్ల రూపాయల సింగరేణి నిధుల ద్వారా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు.

అయితే నిర్మాణ పనులు చేపట్టి పట్టుమని 3రోజులు గడవకముందే డివైడర్ కూలిపోవడం, పగుళ్లు రావడం మండలంలో సంచలనంగా మారింది. కాంట్రాక్టర్ సంబంధించిన ఏఈ, డీఈ అధికారులు కుమ్మక్కై లక్షల రూపాయలను మిగిలించుకొని రోడ్డు నిర్మాణ పనులు నాసిరకంగా చెప్పట్టడం ద్వారానే నిర్మించిన డివైడర్ అక్కడక్కడ కూలిపోతున్నాయని మండల ప్రజలు అంటున్నారు. కాంట్రాక్టర్ రోడ్డు, డివైడర్ పనులు నాసిరకంగా చేపడుతున్నారని దిశ పత్రికలో వస్తున్న కథనాలకు సంబంధించి ఏఈ, డీఈ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించారని స్థానిక ప్రజాలంటున్నారు. కాంట్రాక్టర్, సంబంధిత డీఈ, ఏఈ అధికారులు కుమ్మక్కు అవ్వడం వల్లే రోడ్డు, డివైడర్ నిర్మాణ పనులు కూలిపోతున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


వర్క్ ఆర్డర్ అడిగితే తడబడుతున్న డీఈ, ఏఈ..

2 కోట్ల రూపాయలతో అంబేద్కర్ సెంటర్ నుంచి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ వరకు నిర్మిస్తున్న రోడ్డు, డివైడర్ పనుల వర్క్ ఆర్డర్‌ను దిశ పత్రిక విలేకరి సంబంధిత డీఈ, ఏఈ అధికారులను అడిగితే "చూద్దాం లేండి" "పంపిస్తాంలేండి"అని చెప్పుకుంటూ మాట దాట వేయడం మండలంలో సంచలనం రేపుతోంది. వర్క్ ఆర్డర్ అడుగుతే మాట దాటివేడయం వెనుక రహస్యం ఏంటనేది పలు అనుమానాలకు దారి తీస్తోంది. ఈ రోడ్డు నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్ సంబంధిత డీఈ, ఏఈ అధికారులను కొంత ముడుపులను అప్పజెప్పడం వల్లే వర్క్ ఆర్డర్ ఎవ్వరికి ఇవ్వడం లేదనే ఆరోపణలు జోరుగా వినిపిస్తోంది.

దీనికి తోడు జిల్లా ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేయకపోవడం వల్లే సంబంధిత డీఈ, ఏఈ అధికారులు కాంట్రాక్టర్ ఇచ్చే ముడుపులకు అలవాటు పడుతున్నారనే వదంతులు కూడా వినిపిస్తున్నాయి. గతంలో కూడా మండలంలో చేపట్టిన కొన్ని నిర్మాణ పనుల్లో కొన్ని లక్షల రూపాయలను మింగేశారనే ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి.ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు డీఈ, ఏఈ అధికారులపై కఠిన చర్యలు తీసుకోని కాంట్రాక్టర్ లైసెన్స్ రద్దు చేసి రోడ్డు నిర్మాణ పనులకు సంబంధించిన బిల్లులను వెంటనే ఆపివేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.



Next Story