అంధత్వ నివారణే లక్ష్యంగా 'కంటి వెలుగు'.. జిల్లా వైద్యాధికారి బి.మాలతి

by Javid Pasha |   ( Updated:2023-01-17 16:51:07.0  )
అంధత్వ నివారణే లక్ష్యంగా కంటి వెలుగు.. జిల్లా వైద్యాధికారి బి.మాలతి
X

దిశ, కామేపల్లి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు పథకం ఈనెల 18న ప్రారంభం కానుందని ఖమ్మం జిల్లా వైద్యాధికారి డాక్టర్ బి.మాలతి తెలిపారు. మంగళవారం కంటి వెలుగు వివరాలను ఆమె విలేకరులకు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 15.80 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో కంటివెలుగు విజయవంతం కొరకు 55 ప్రత్యేక టీంలు, 550 మంది సిబ్బందిని సైతం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 65 వేల కళ్ళద్దాలను సైతం ముందస్తుగా పంపిణీకి సిద్ధం చేసినట్లు తెలిపారు. ప్రతిరోజు గ్రామీణ ప్రాంతంలో 300 మందికి ఐ స్క్రీనింగ్ టెస్టులను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. నేడు ఖమ్మం లో సీఎం కేసీఆర్ కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.



Next Story

Most Viewed