'మూఢ నమ్మకాల వ్యతిరేఖ చట్టం చేయాలి'

by Vinod kumar |
మూఢ నమ్మకాల వ్యతిరేఖ చట్టం చేయాలి
X

దిశ ఖమ్మం కల్చరల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మూఢనమ్మకాల వ్యతిరేక చట్టం తీసుకురావాలని జెవివి రాష్ట్ర కార్యదర్శి ఆలవాల నాగేశ్వర రావు కోరారు. ఆదివారం ఖమ్మం ఎన్‌యస్‌పీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన జన విజ్ఞాన వేదిక జిల్లా వార్షిక ప్లీనం సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజల్లో ఉన్న మూఢ నమ్మకాలను తొలగిపోవాలన్నారు. ఆధునిక సమాజంలో అభివృద్ధి చెందుతున్న సైన్స్ సమాజ శ్రేయస్సుకు తోడ్పడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శివనారాయణ, రామారావు, ఎం. వీరభద్ర రావు, నారాయణ, ఎల్ వి రెడ్డి, మోహన్, డాన్ బోస్కో, రాఘవయ్య, ఐలయ్య, ఝాన్సీ, నాగమల్లేశ్వరరావు, సుబ్బారావు, భాస్కర్ రెడ్డి, కె. నాగేశ్వరరావు, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed