రైతులకు పవర్​ స్ప్రేలు పంపిణీ

by Sridhar Babu |
రైతులకు పవర్​ స్ప్రేలు పంపిణీ
X

దిశ, టేకులపల్లి : టేకులపల్లి మండలం పీఏసీఎస్ బేతంపూడి సంఘం ఆధ్వర్యంలో అగ్రిటెక్ వరంగల్ వారి నుండి రైతులకు పవర్​ స్ప్రేలు పంపిణీ చేశారు. సంఘ అధ్యక్షులు లక్కినేని సురేందర్ రావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సంఘంలో తక్కువ ధరకు వ్యవసాయ పనిముట్లు, ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు అందుబాటులో ఉన్నాయని కావున రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సంఘం సీఈవో, సిబ్బంది రైతులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed