- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
పేదలకు ఇంటి స్థలాలు పంపిణీ

దిశ,తిరుమలాయపాలెం : సుమారు 40 సంవత్సరాలుగా ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్న బాధితుల కల నెరవేరింది. శుక్రవారం ఖమ్మం రూరల్ పరిధిలోని పోలపల్లి గ్రామంలోని ఓ పంక్షన్హాల్లో జరిగిన పాలేరు నియోజకవర్గ సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాత మధు పాల్గొన్నారు. మండలంలోని తిరుమలాయపాలెం, హస్నాబాద్ గ్రామాల్లో రెవెన్యూ అధికారులు సర్వేలు నిర్వహించి, ఇండ్లు లేని నిరుపేదలను గుర్తించారు.
ప్రస్తుతం తిరుమలాయపాలెం (82), హస్నాబాద్ (27) అర్హులైన నిరుపేదలకు ఇండ్ల స్థలాల తోపాటు, మండలంలోని పలు గ్రామాలకు చెందిన కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే కందాళ,ఎమ్మెల్సీ తాత లబ్ధిదారులకు అందించారు. స్థానిక సర్పంచ్ కొండబాల వెంకటేశ్వర్లు, తహసీల్ధార్ పుల్లయ్య, ఎంపీపీ బోడ మంగీలాల్, ఎంపీడీఓ జయరాం నాయక్, నాయబ్ తహసీల్ధార్ నరసింహారావు, ఆర్యలు వీరయ్య, లహారి, టి.పాలెం, పీఏసీఎస్ వైస్ చైర్మన్ రాజు తదితరులు పాల్గొన్నారు.