రైల్వే లైన్ భూ నిర్వాసితులకు చెక్కుల పంపిణీ: ఎమ్మెల్యే రేగా

by Mahesh |
రైల్వే లైన్ భూ నిర్వాసితులకు చెక్కుల పంపిణీ: ఎమ్మెల్యే రేగా
X

దిశ, మణుగూరు: భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ రైల్వే లైన్ నిర్మాణం కింద భూములు కోల్పోయిన భూ నిర్వాసితుల అందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. సోమవారం మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో మండల జడ్పిటిసి పోశం నరసింహారావు ఆధ్వర్యంలో పవర్ ప్లాంట్‌లో భూములు కోల్పోయిన భూ నిర్వాసితులకు ప్రభుత్వం నుంచి మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే రేగా మాట్లాడుతూ.. భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ రైల్వే లైన్ నిర్మాణం కింద భూములు కోల్పోయిన భూ నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. భూములు కోల్పోయిన రైల్వేలైన్ భూ నిర్వాసితులను ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని కోటి రూపాయల విలువ గల చెక్కులను మంజూరు చేసిందన్నారు. అదే విధంగా పవర్ ప్లాంట్ నిర్మాణం కింద ఇల్లులు కోల్పోయిన వారికి ప్రభుత్వం ఇంటి స్థలాలు కేటాయిస్తుందన్నారు.

రానున్న రోజుల్లో భూ నిర్వాసితుల అందరికీ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని తెలిపారు. నష్ట పరిహారం అందని వారు ఆందోళన చెందవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, పీఏసీఎస్ చైర్మన్ కుర్రి నాగేశ్వరరావు, టౌన్ అధ్యక్షుడు అడపా అప్పారావు, నాయకులు బోలిశెట్టి నవీన్, గుర్రం సృజన్, మేకల రవి, మండల తహసీల్దార్ నాగరాజు, టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed