- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
దిశ ఎఫెక్ట్...ఆ రెండు అక్రమ భవనాల వివరాలు సేకరించిన ఎమ్మెల్సీ

దిశ, వైరా : వైరా మున్సిపాలిటీలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మించిన రెండు భవనాల వివరాలను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు సేకరించారు. దిశ వెబ్సైట్లో సోమవారం "అక్రమ భవనాలపై చేతులెత్తేసిన అధికారులు" అనే వార్త కథనం ప్రచురితమైంది. ఈ వార్త కథనాన్ని పరిశీలించిన ఎమ్మెల్సీ తాతా మధు ఈ రెండు అక్రమ భవనాల వివరాలను పూర్తిస్థాయిలో సేకరించినట్లు సమాచారం. వైరాలోని ఎస్బిఐ బ్యాంక్ పై ఎలాంటి అనుమతులు లేకుండా మూడవ అంతస్తు నిర్మించారు. అంతేకాకుండా మూడో అంతస్తు అక్రమంగా నిర్మించిన యజమానే ఎస్బిఐ వెనుక భాగంలో మరో అక్రమ నిర్మాణం చేపట్టేందుకు పిల్లర్ల కోసం గోతులు తవ్వారు.
అదేవిధంగా ఎంవీఐ కార్యాలయం ఎదురుగా గంధం టవర్స్ ముందు భాగంలో కనీస అనుమతులు లేకుండా అపార్ట్మెంట్ మెంట్ లోకి వెళ్లేందుకు తీసిన ద్వారాన్ని మూసివేసి అక్రమ కాంప్లెక్స్ నిర్మించారు. ఈ రెండు అక్రమ భవనాలపై దిశ దినపత్రిక గతంలోనే వార్తా కథనాలు ప్రచురించింది. సోమవారం దిశ వెబ్సైట్లో వచ్చిన వార్త కథనానికి ఎమ్మెల్సీ తాతా మధు స్పందించి పూర్తి వివరాలు సేకరించారు. అక్రమ భవనాలపై కూడా జిల్లా కలెక్టర్ కు ఎమ్మెల్సీ ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం.