- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
దిశ ఎఫెక్ట్...నూనె గోదాములో తనిఖీలు....ముందస్తు సమాచారంతో వ్యాపారులు అప్రమత్తం

దిశ, ఖమ్మం సిటీ : ఖమ్మం నగరంలో జరుగుతున్న కల్తీ నూనెలో అమ్మకాలపై దిశపత్రికలో బుధవారం కల్తీ మాయ అనే శీర్షిక కథనం ప్రచురితం అయింది. దీంతో జిల్లా యంత్రాంగంలో నామమాత్రపు కదిలిక వచ్చింది. జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు సంబంధించిన కంపెనీ పై దాడి చేశారు. కానీ కొందరు అధికారులు వారితో దోస్తీ కట్టడంతో అప్రమత్తమయ్యారు. దీనిపై ఫుడ్ ఇన్స్పెక్టర్ ని వివరణ కోరగా వారికి కేవలం అశోక బ్రాండ్ మాత్రమే అనుమతి ఉందని, మిగిలిన ఎలాంటి బ్రాండ్లు వాళ్లు తయారు చేయడానికి వీలు లేదని తేల్చి చెప్పారు. అదే విధంగా లూస్ ఆయిల్ కూడా అమ్మడానికి వీలులేదని, తమ దృష్టికి ఇంతవరకు ఈ విషయం రాలేదని తెలిపారు. కానీ అధికారులు తూతూ మంత్రంగా ఆయిల్ డబ్బాల్లోని శాంపిళ్లను సేకరించారు. అక్కడ ఎలాంటి లూస్ ఆయిల్ అమ్మకాలు జరగడంలేదని రికార్డుల్లో నమోదు చేసినట్టు సమాచారం. చర్యల్లో భాగంగా అరవై, 15 లీటర్ల రేకు డబ్బాలను సీజ్ చేశారు. ఆ తరువాత తూనికలు కొలతల అధికారిని 15 లీటర్ల డబ్బాలపై వేసిన ఎమ్మార్పీలను ఏ నెలకు ఆ నెలే వేయాలని, రెండు మూడు నెలల ధరలు వాటిపై కనిపించకూడదని, స్టిక్కరింగ్ మార్పింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమార్కుల భరతం పట్టాల్సిన అధికారులే వారితో దోస్తీ కట్టి వారి వ్యాపారానికి వంతపాడారు. కళ్లముందు సాక్ష్యాలు కనిపిస్తున్నప్పటికీ వాటిని ఏ మాత్రం పట్టించుకోకుండా వ్యాపారులు చెప్పిన మాటలకు అధికారులు తలొగ్గారు. జిల్లా కలెక్టర్ విచారణ నిర్వహించాలని ఆదేశించినప్పటికీ సంబంధిత శాఖ అధికారులు మాత్రం తూతూ మంత్రంగా విచారణ పూర్తి చేశారు.
అంతా అప్రమత్తం
ఖమ్మం గ్రైన్ మార్కెట్ పరిధిలోని వాసవి పామాయిల్ గోదాములో యధేచ్ఛగా లూస్ ఆయిల్ విక్రాయాలు జరుగుతున్నాయని వార్త ప్రచురితం కావడంతో అధికారులు తనిఖీలు చేసేందుకు వచ్చారు. కానీ అప్పటికే ఆ విషయం వ్యాపారులకు తెలవడంతో అప్రమత్తమయ్యారు. బయట ఉన్న యంత్రాలను దారి మళ్లించారు. అదేవిధంగా నిండుగా ఉన్న డ్రమ్ములను, ఇతర కంపెనీలకు సంబంధించిన ఆయిల్ ను సైతం మాయం చేశారు. అధికారులు వచ్చే సమయానికి గోదాం పరిసర ప్రాంతాలు మొత్తం నీటుగా ఉంచారు. అధికారులు వచ్చి వ్యాపారుల నుంచి వివరాలు సేకరించారు. ఈ గోదాంలో లూస్ ఆయిల్ విక్రయిస్తున్నారా ? ఇతర వేరే రకాల బ్రాండ్ల అమ్మకాలు జరుగుతున్నాయా ? ఖాళీ డ్రమ్ములు ఉన్నాయి ఏంటి ? నిండుగా ఉన్న డ్రమ్ములు ఎక్కడ ఉన్నాయి ? అనే ప్రశ్నలు వేశారు. దీంతో వ్యాపారులు ఇక్కడ తాము లూస్ ఆయిల్ అమ్మడం లేదని , కేవలం అశోక బ్రాండ్ పామాయిల్ మాత్రమే అమ్ముతున్నామని చెప్పారు. దాంతో అశోక బ్రాండ్ ఆయిల్ డబ్బాలోని ఆయిల్ ను శాంపిల్ గా సేకరించి విచారణ ముగించారు. దాంతో కథ మళ్లీ మొదటికొచ్చింది.