- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
దిశ ఎఫెక్ట్...వరుస కథనాలతో కదులుతున్న డొంక

దిశ, ఖమ్మం సిటీ : సాంఘిక సంక్షేమ శాఖలో జిల్లా అధికారిగా పనిచేస్తూ షెడ్యూల్డ్ కులాల సహకార సంఘం శాఖకి ఈడీగా అదనపు బాధ్యత నిర్వహించిన సమయంలో ఎస్సీలకు కేటాయించిన లోన్లపై దిశ వరుస కథనాలతో ఇంటలిజెన్స్ అధికారులు ఆరా తీశారు. 2021-22 సంవత్సరానికి గాను మొత్తం కేటాయించిన 593 లోన్లలో ఎవరెవరికి కేటాయించారనే దానిపై ఆరా తీశారు. సంబంధిత అధికారులు మాత్రం తన చుట్టూ ఉన్న అక్రమార్క కుల సంఘం నాయకులను అలర్ట్ చేసినట్లు వినికిడి. ఇప్పుడున్న సాంఘిక సంక్షేమ శాఖ అధికారి మాత్రం ఏ నిమిషానికి ఏం జరుగుతుందో అని వివిధ కుల సంఘాల నాయకులకు ఫోన్ చేసి ఆరా తీసినట్లు సమాచారం.
అంతేకాక ఈ శాఖ పరిధిలో బెస్ట్ అవైలబుల్ పాఠశాల యాజమాన్యాల నుంచి కూడా ప్రతి ఏటా పెద్ద మొత్తంలో అధికారికి మామూలు అందుతున్నాయని సమాచారం. ప్రైవేట్ కళాశాలలో చదివే విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఆ కళాశాల యాజమాన్యాలు కూడా సొమ్ములు ముట్ట చెప్పందే ఫైళ్లు కదిలేవి కాదని బాధితులు ఆరోపిస్తున్నారు. కొంతమంది వ్యక్తుల సమాచార ప్రకారం ఈ అధికారి పదోన్నతులు కూడా అక్రమ మార్గంలో పొందినట్లు తెలిసింది. జిల్లా కలెక్టర్ తగు విచారణ జరిపి న్యాయం చేయాలని, అక్రమ మార్గంలో పొందిన లోన్లు రద్దుచేసి న్యాయం చేయాలని జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎస్సీ నిరుద్యోగులు కోరుతున్నారు.