- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
దిశ ఎఫెక్ట్ ...వల్లాపురంలో వైద్య శిబిరం

దిశ, వైరా : దగ్గు, జలుబు, గొంతునొప్పి తో పాటు ఫ్లూ జ్వరాలతో బాధపడుతున్న వల్లాపురం గ్రామంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఎట్టకేలకు ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వల్లాపురంలో ప్రజలు ఫ్లూ జ్వరాలతో బాధపడుతున్న విషయాన్ని దిశ వెబ్సైట్, దినపత్రిక "వణుకుతున్న వల్లాపురం" అనే వార్తా కథనాన్ని మంగళవారం రాత్రి, బుధవారం ప్రచురించింది. దిశ వెబ్సైట్లో కథనం చూసిన జిల్లా కలెక్టర్ విపి.గౌతమ్ గంట వ్యవధిలోపే స్పందించి వల్లాపురంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మాలతీని ఆదేశించారు. దీంతో బుధవారం ఉదయం 8 గంటలకే వల్లాపురం గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వైద్య ఆరోగ్య సిబ్బంది నాలుగు బృందాలుగా ఏర్పడి గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేశారు.
ఈ సందర్భంగా గ్రామంలో అనేకమంది జ్వరంతో బాధపడుతున్నామని వైద్య ఆరోగ్య సిబ్బందికి తమ బాధను వివరించారు. అనంతరం వైద్య శిబిరంలో గ్రామస్తులకు జ్వరంతో పాటు కోవిడ్, బ్లడ్ స్మియర్, సీరం సాంపిల్స్ పరీక్షలు నిర్వహించారు. దగ్గు, విపరీతమైన జలుబుతో బాధపడుతున్న రోగులకు తేమడ పరీక్షలు జరిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వైద్య శిబిరంలో మందులు పంపిణీ చేశారు. ఈ గ్రామంలో మరో రెండు రోజులు వైద్య శిబిరాన్ని నిర్వహిస్తామని మండల వైద్యాధికారి నంద్యాల బాలకృష్ణ దిశ కు తెలిపారు. ఖమ్మం కు చెందిన ఎఫడమిక్ జిల్లా సెల్ డాక్టర్ మాధవరావు, మండల వైద్యాధికారులు నంద్యాల బాలకృష్ణ, తాతా ఉదయలక్ష్మి రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. గ్రామంలో జ్వర సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వైద్య శిబిరం ఏర్పాటు చేసేందుకు విశేష కృషి చేసిన దిశ దినపత్రికకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్ హెచ్ పీ, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.