అంగన్వాడీ కేంద్రాల సమస్యలపై అసెంబ్లీలో చర్చ

by Sridhar Babu |
అంగన్వాడీ కేంద్రాల సమస్యలపై అసెంబ్లీలో చర్చ
X

దిశ, ఇల్లందు : అంగన్వాడీ కేంద్రాలలో గర్భిణులు, చిన్నపిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలపై శుక్రవారం అసెంబ్లీ సమావేశాలలో ఎమ్మెల్యే హరిప్రియ చర్చకు లేపారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వం మహిళల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి ఎన్నో పథకాలు తీసుకొచ్చిందని, అందులో భాగంగానే ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా గర్భిణులకు,

బాలింతలకు, చిన్న పిల్లలకు పౌష్టిక ఆహారాన్ని అందించడం జరుగుతుందని తెలిపారు. కానీ అంగన్వాడి కేంద్రాలను నిర్వహించేందుకు పక్కా భవనాలు లేవని, ఉన్న భవనాలకు పవర్ సప్లై లేక చిన్న పిల్లల ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. వెంటనే అంగన్వాడి కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించే విధంగా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. గురుకుల పాఠశాలల్లో ఎంతోమంది ఉచితంగా చదువుకుంటున్నారని, వారి సంఖ్యను పెంచాలని కోరారు. గురుకుల పాఠశాలలకు ,కళాశాలలకు ప్రభుత్వం పక్కా భవనాల నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు.



Next Story

Most Viewed