విజ్ఞానాన్ని వినియోగించే విచక్షణ అవసరం : జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ టి.శ్రీనివాసరావు

by Sridhar Babu |   ( Updated:2022-11-26 11:52:51.0  )
విజ్ఞానాన్ని వినియోగించే విచక్షణ అవసరం : జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ టి.శ్రీనివాసరావు
X

దిశ, లీగల్ ఖమ్మం : విజ్ఞానాన్ని వినియోగించే విచక్షణ అవసరం అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ టి.శ్రీనివాసరావు అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం ఖమ్మం నగరంలో సెయింట్ జోసఫ్ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ దినోత్సవ ప్రాముఖ్యత ను గురించి వివరించారు. ప్రతి ఒక్క విద్యార్థి తమ తల్లిదండ్రులను గౌరవించాలని అన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి ఒక లక్ష్యాన్ని పెట్టుకొని దానిని సాధించే దిశగా కష్టపడాలన్నారు. ఈకార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ రెవ ఎస్. విజయమేరి , ప్రిన్సిపాల్ రెవ ఆరోగ్య మేరి, పాఠశాల లీగల్ అడ్వజైర్ , న్యాయవాది కంచర్ల విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed