- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
సమ్మెలో ఉన్నకార్మికులకు ఇబ్బందులు పెడితే సహించం.. సీపీఎం జిల్లా నేత

దిశ, కూసుమంచి : రాష్ట్రవ్యాప్తంగా 19 రోజుల నుంచి సమ్మెలో ఉన్న గ్రామపంచాయతీ కార్మికుల డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించకుండా మొండిగా వ్యవహరిస్తుందని, సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి కొంతమంది అధికారులు, ప్రజాప్రతినిధులు తమ ప్రయత్నాలు మానుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భూక్యా వీరభద్రం హెచ్చరించారు. సమ్మెలో ఉన్న కార్మికులకు మద్దతుగా సీపీఎం జిల్లా కమిటీ పిలుపులో భాగంగా మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయం ముందు కార్మికులతో కలిసి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా భూక్యా వీరభద్రం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికులను ఉద్యోగస్తులుగా గుర్తించకుండా మొండిగా వ్యవహరించడం సరైనది కాదని, వెంటనే గ్రామపంచాయతీ కార్మికుల జేఏసీ నాయకులతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపి డిమాండ్లు పరిష్కరించి సమ్మెను విరమింప చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం మొండిగా వివరించడంతో సమ్మె కొనసాగుతుందని సమ్మె వల్ల గ్రామాలు పారిశుద్ధ్యం అస్తవ్యస్తంతో ప్రజలు రోగాల బారిన పడే ప్రమాదం ఉందని ప్రభుత్వం పోటీ కార్మికులను నియమించకుండా ఉన్న కార్మికుల సమస్యను సానుకూలంగా స్పందించి పరిష్కరించాలని కోరారు. అనంతరం స్థానిక ఎంపీడీవోకు వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో కల్లూరిగూడెం సొసైటీ మాజీ చైర్మన్ వెల్లంపల్లి అశోక్, సీపీఎం మండల కమిటి సభ్యులు, మూడ్ గన్యా నాయక్, బిక్కసాని గంగాధర్, కర్ణబాబు, ఐఎఫ్టీయూ నాయకులు, ఐ వెంకన్న, కార్మిక నాయకులు జంగిలి వెంకట నారాయణ, రెంటాల అశోక్, కిన్నెర కమలమ్మ, సాయి, వెంకట్, భానోత్ రమేష్, సాగర్, కందుల మంగమ్మ, కె.కమలమ్మ మలిశేట్టి నరసింహ, సైదులు నగేష్ తదితరులు పాల్గొన్నారు.