డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వాలని ఎమ్మెల్యే కార్యాలయం ఎదుట ధర్నా

by Vinod kumar |
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వాలని ఎమ్మెల్యే కార్యాలయం ఎదుట ధర్నా
X

దిశ, ఇల్లందు: అర్హులైన పేదలందరికీ డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఇల్లందు ఫారెస్ట్ గ్రౌండ్ నుండి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆవునూరి మధు మాట్లాడుతూ.. అర్హులైన పేదలందరికీ డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని, జాగా ఉన్న వారందరికీ ఇల్లు కట్టుకునేందుకు 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించాలన్నారు.


తెలంగాణ ప్రభుత్వం జాగలున్న పేదలకు 3 లక్షల రూపాయలు ఇస్తుందన్నారు. కానీ, ధరలు పెరగడం వలన మూడు లక్షల రూపాయలు ఏ మాత్రం సరిపోవని 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు తుపాకుల నాగేశ్వరరావు, సారంగపాణి, పొడుగు నరసింహారావు, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed